Thursday, May 2, 2024

క్వారీల వ‌ల్లే వింత శ‌బ్దాలు .. ప‌ట్టించుకోని అధికారులు ..

భూకంపాల‌తో జ‌నం భ‌యాందోళ‌న‌కి గురి అవుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో మ‌రోమారు భూమికంపించింది. రామ‌కుప్పం మండ‌లంలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. దాంతో జ‌నం ఇళ్ళ నుండి బ‌య‌టికి ప‌రుగులు తీశారు. గడ్డూరు, చిన్నగరిగేపల్లి, ఎస్‌.గొల్లపల్లి, గొరివిమాకులపల్లిలో వరుస భూ ప్రకంపనలు అలజడి రేపుతున్నాయి. రాత్రి నుంచి వింత శబ్ధాలతో రావడంతో భయంతో జనం పరుగులు పెట్టారు. వరుస ప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లోకల్‌ క్వారీల వల్లే ఈ శబ్దాలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. భయంతో అర్ధరాత్రి నంచి జాగరం చేస్తున్నట్లు పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేద‌ని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement