Monday, April 29, 2024

ద‌ర్శ‌కుల‌పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తెలుగు సినీ దర్శకులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జోడిగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రం తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… టాలీవుడ్ డైరెక్టర్స్‌‌ టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ స్పాట్‌కు వచ్చాక డైరెక్టర్స్ డైలాగ్‌లు రాసిస్తున్నారని.. ఇది నటులకు చాలా ఇబ్బంది కలిగించే అంశమన్నారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు.

డైరెక్టర్స్ స్క్రిప్ట్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని.. మరింతగా శ్రమించాలని చురకలు అంటించారు. డైరెక్టర్స్ ముందే స్క్రిప్ట్ ఇస్తే ఫెర్మామెన్స్‌పై దృష్టి పెడతారని చిరంజీవి చెప్పారు. టాలీవుడ్ డైరెక్టర్స్ తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలతో పాటుగా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement