Wednesday, May 1, 2024

హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్​గా చింతా ప్రభాకర్‌.. ఉత్తర్వులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

ఉమ్మడి మెదక్‌ బ్యూరో, (ప్రభ న్యూస్‌): సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ తెలంగాణ హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. సోమవారం రాత్రి హ్యాండ్లూమ్‌ చైర్మన్‌గా చింతా ప్రభాకర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావు ఆశీర్వాదంతోనే తనకు తెలంగాణ హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్ పదవి దక్కిందన్నారు. 2014లో టీఆర్‌ ఎస్‌ నుండి పోటీ చేసి 36 వేల ఓట్ల పైచీలుకతో గెలుపొందానన్నారు. సంగారెడ్డి అభివృద్ధికి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావు ఉందన్నారు. సంగారెడ్డి రూపురేఖలు పూర్తిగా మార్చామన్నారు.

సంగారెడ్డి అభివృద్ధితో పాటు హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి కృషిచేస్తానని ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ తెలిపారు.
జిల్లా అభివృధ్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నా అన్నారు. జిల్లా పార్టీ ఉన్నతి ఓ వైపు, జిల్లా సమగ్రాభివృద్ధి ఓ వైపు చూసుకుంటూనే నియోజకవర్గ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నట్టు చెప్పారు. మంత్రి హరీష్‌రావు సహాకారంతోనే జిల్లా అన్ని రంగాల్లో ముందుకుపోతోందని, హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement