Friday, April 26, 2024

పేలిన ఫోన్ – ఎనిమిది నెల‌ల చిన్నారి మృతి

ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేల‌డంతో ఎనిమిది నెల‌ల చిన్నారి మృతి చెందింది.ఈ సంఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. ఓ వ్యక్తి త‌న‌ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేశాడు.దీంతో అకస్మాత్తుగా ఫోన్ బ్యాటరీ పేలి (మొబైల్ ఫోన్ బ్లాస్ట్) ప‌క్క‌నే ఉన్న మంచానికి మంటలు అంట‌కున్నాయి. ఈ క్రమంలో మంచంపై నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారి తీవ్రంగా గాయ‌ప‌డి.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తల్లి కుసుమ మాట్లాడుతూ.. తాను ఆరుబయట బట్టలు ఉతుకుతుండగా.. పెద్ద శ‌బ్ధం వ‌చ్చిందనీ, త‌న కూతురు అరుపులు విన్న వెంట‌నే.. పరుగున అక్కడికి చేరుకున్నాన‌నీ, ఆ లోపే త‌న చిన్నారి తీవ్రంగా గాయ ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement