Thursday, April 25, 2024

నేటి నుంచి కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే చంద్ర‌బాబు కుప్పం టూర్‌పై టెన్షన్ నెలకొంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ శాంతిపురం మండలంలో పర్యటించనున్నారు. రేపు కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమ‌వుతారు. 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.

మరోవైపు చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని.. రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా జీవోలను ఉటంకిస్తూ డీఎస్పీ నోటీసులు పంపిన విష‌యం తెలిసిందే. మరోవైపు పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంక్షల పేరుతో కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కార్యాచరణకు అనుగుణంగానే మందుకు వెళ్తామని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement