దీపావళి పండగ సందర్భంగా చమరు ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు తగ్గించినట్లు కేంద్రం వెల్లడించింది. పామాయిల్పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్పై రూ.10, పొద్దుతిరుగుడు నూనె ధరను రూ.7 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, దీపావళి సందర్భంగా ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement