Thursday, May 16, 2024

సామాన్యుల‌పై భారం మోపుతోన్న కేంద్ర ప్ర‌భుత్వం – ఎమ్మెల్సీ క‌విత‌

బిజెపి ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ క‌విత‌. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని బిజెపి ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.ప్రధాని మోడీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్నారు..సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.102 పెంచడం ఎన్నికల తర్వాత అతిపెద్ద ధరల పెంపుగా నిలిచింది.ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత..ప్రజలు దుకాణాలకు సైతం వెళ్లేందుకు భయపడేలా నిత్యావసరాల ధరలు పెంచుతున్నార‌న్నారు.సిలిండర్, పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement