Sunday, May 5, 2024

Big Story: కేంద్రం ఆర్థిక వివ‌క్ష‌, గ్రాంట్లు, సాయాల్లో కోతలు.. గతి తప్పుతున్న అంచనాలు

రాష్ట్రాల నుంచి పన్నులు, సెస్సుల పేరుతో ఖజానాను నింపుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు తిరిగి చెల్లించాల్సిన నిధులపై వివక్ష చూపుతోంది. తీవ్ర తాత్సారం చేస్తూ నిర్దేశించిన అంచనాలను కూడా విడుదల చెయ్యకుండా మోకాలడ్డుతోంది. దీంతో రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావాలు నమోదవుతున్నాయి. సకాలంలో నిదుల విడుదల జరగకపోగా, ప్రకటించిన నిధుల్లోనూ కేంద్రం కోతలు పెడుతూ రాష్ట్రాల హక్కులకు నష్టం కల్గిస్తోంది. ఏటా రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలపై కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు దెబ్బతీస్తున్నాయి. దీంతో బడ్జెట్‌ అంచనాలు తారుమారవుతున్నాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో గతేడాది కూడా ఆదాయ వివరాల్లో భారీ వ్యత్యాసం నెలకొంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గ్రాంట్ల రూపంలో వచ్చే నిధుల్లో కోతలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలనుంచి రావాల్సిన విభజన హామీల్లోనూ కార్యాచరణ పురోగతి లేకుండా పోయింది. కేంద్రంనుంచి వివిధ గ్రాంట్ల రూపంలో ఈ ఏడాదిలో రూ. 38,669కోట్లను అంచనా వేసుకోగా గడచిన ఏడాది కేవలం రూ. 5687 కోట్లే వచ్చింది. 2019-20లో ఈ మొత్తాలు కేవలం రూ. 11,598 కోట్లు మాతత్రమే ఖజానాకు చేరింది. 2020-21లో రూ. 10,525కోట్లనే అంచనా వేసుకోగా, 2020-21లో రూ. 38,669కోట్లు అంచనా వేశారు. అయితే వచ్చింది కేవలం 15శాతంలోపే. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక నిధులు కేంద్రం ఏనాడూ విడుదల చేయలేదు.

2020-21లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, కాంట్రిబ్యూషన్ల రూపంలో రూ. 10,525కోట్ల అంచనా వేయగా, రూ. 15,471కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇకమీదట కేంద్ర ప్రాయోజిత పథకాలను కేంద్ర ప్రభుత్వం హేతుబద్దీకరించడంతో సరికొత్త సవరణలు రాష్ట్రాల్లో కనిపించనున్నాయి. సీఎస్‌ఎస్‌ల జాబితాలో జాతీయ ఆరోగ్య మిషన్‌, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస యోజన, నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మిషన్‌, సర్వశిక్షా అభియాన్‌, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌, మధ్యాహ్న భోజనం వంటి అనేక పథకాలున్నాయి.

గ్రామీణ సంస్థలకు కేంద్ర గ్రాంట్లు, స్వచ్చ భారత్‌ కింద మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధుల్లో కోతలు పడ్డాయి. గతంలో ఉన్న 60 పథకాలను 30కి కుదించిన కేంద్రం పథకాలను మూడు రకాలుగా వర్గీకరించింది. అవి అతి ముఖ్యమైన, ముఖ్యమైన, ఐచ్చికమైనవిగా వర్గీకరణ చేసింది. దీంతో ముఖ్యమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి కేంద్ర పథకాలకు తప్పనిసరిగా నిధుల విడుదల జరగనుండగా, ఈ పథకంలోని పలు నిబంధనలను, నియంత్రణలతో కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది.

గత రెండేళ్లుగా తగ్గుతున్న నిధుల వాటా…
కాగా గతేడాది కాలంగా కేంద్ర ప్రాయోజిత పథకాల(సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీమ్స్​)కు భారీగా నిధులు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరిగింది. ఆశించిన నిధులు రాకపోవడంతో ప్రభావం అంతా ఆయా పథకాలపై పడుతోంది. 2016-17 వార్షిక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్‌) కింద రూ. 9163 కోట్లు రానున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే 2015-16లో ఇవి రూ. 6497 కోట్లు కాగా… అంతకు క్రితపు ఏడాదితో పోలిస్తే ఇవి భారీగా తగ్గాయని ఆర్ధిక శాఖ లెక్కలు వేసింది. 2014-15లో ఈ పద్దుకింద తెలంగాణకు రూ. 11781 కోట్లు ఖజానాకు చేరాయి. కానీ గత రెండేళ్లుగా నానాటికీ కేంద్ర పథకాలకు కేంద్రం తన వాటాను తగ్గిస్తూ వస్తోంది.

- Advertisement -

ఫలితంగా తగ్గిన వాటా మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పెరుగుతోంది. కేంద్ర సాయానికి తోడు రాష్ట్రం కూడా తన వంతుగా కొంత మొత్తాన్ని కలిపి ఈ పథకాలను అమలు చేయాల్సి రావడంతో ఈ భారం రాష్ట్ర ఖజానాపై పడుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఖజానాకు అంచనా వేసిన గ్రాంట్లు కాంట్రిబ్యూషన్‌లు (రూ. కోట్లలో….)
ఏడాది అంచనా విడుదల శాతం

2018-19 29041 8177 28.16
2019-20 8177 11598 141.83
2020-21 10,525 15471 146.99
2021-22 38669 5687 14.71

వీటికే కోతలు…
కేంద్ర ప్రాయోజిత పథకాల్లో భాగంగా ఎక్కువ శాతం నిధులు గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సి ఉండగా భారీగా తగ్గింపులు చేశారు. సమగ్ర వాటర్‌షెడ్‌ ఫథకానిికి గత బడ్జెట్‌ిలో కేటాయించిన రూ. 125 కోట్లను పూర్తిగా కోత పెట్టింది. జాతీయ జీవనోపాధి మిషన్‌ పథకం వచ్చే నిధులు కూడా రూ. 103కోట్లనుంచి రూ. 76 కోట్లకు తగ్గడంతో ఈ పథకంపై కొంత మేర ప్రభావం పడనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్త్తున్న పేదల పింఛన్ల పథకానికి కేంద్రం నుంచి రూ. 254 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంది. 15వ ఆర్ధికసంఘం నిర్దేశించినట్లుగానే రాజ్యాంగంలోని 270 ఆర్టికల్‌ ప్రకారం ఆయా రాష్ట్రాలకు వారి దామాషాలో కేంద్రం నిధులను వెచ్చిస్తోంది.

అయితే ఇవి కూడా అనేక సందర్భాల్లో తీవ్ర జాప్యమైన ఉదంతాలున్నాయి. పథకాల వారీగా కేటాయింపులను స్పష్టం చేయడం ఆనవాయితీ కాగా, మూడేళ్లుగా ఏ ఏడాది కూడా కేంద్రం ఒక్క రూపాయి అధికంగా తెలంగాణకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక సాయంగా 2015-16నుంచి మూడేళ్లపాటు రూ. 450కోట్ల చొప్పున రూ. 1350 కోట్లను విడుదల చేసింది. ఇక అన్ని రాష్ట్ర్రాలకూ ఇచ్చినట్లుగానే కేంద్ర ప్రాయోజిత పథకాలకు నాలుగేళ్లలో రూ.23,116కోట్లను కేటాయింపులు చేసింది. ఇందులో 2014-15లో రూ. 5028కోట్లు, 2015-16లో రూ. 6047కోట్లు, 2016-17లో రూ. 6579కోట్లు, 2017-18లో రూ. 5463కోట్లను కేటాయించింది. తెలంగాణకు సీఎస్‌టీ పరిహారం రూపంలో రూ.11443కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం రూ. 1253కోట్లను మాత్రమే విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement