Friday, May 3, 2024

Flash: మాజీ మంత్రి తుమ్మల అనుచరులపై నాన్ బేయిలబుల్ కేసులు

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అనుచరగణంపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నాన్ బె యిలబుల్ కేసులు నమోదు చేశారు. టిఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ అరెస్టు ఉదంతం నేపథ్యంలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భాస్కర్ భార్య కల్పన, ధర్నా, తుమ్మల అనుచరుల ఆందోళనలు గురువారం అర్ధరాత్రి  కొనసాగిన విషయం తెలిసిందే. అందరిని లాఠీలతో చితకబాదిన పోలీసులు.. తమ విధులకు ఆటంకం కలిగించారని తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు తొమ్మిది మందిపై పలు సెక్షన్ లతో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు అయిన వారిలో శాఖమూరి రమేష్ , తమ్మినేని కృష్ణయ్య , జొన్నలగడ్డ రవి , బండి జగదీష్, బానోతు కృష్ణ , మహిపాల్, బానోతు వీరన్న , తోట వీరభద్రం, వీరభద్రం తదితరులు ఉన్నారు.

ఇదిలా ఉండగా, గువ్వలగూడెం గ్రామానికి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, టిఆర్ఎస్ నాయకులు, రావెళ్ల శ్రీనివాస రావుపై నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. కేసుల నమోదుతో తుమ్మల వర్గం ఉడికిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement