Friday, April 26, 2024

రేపు విచారణకు రాలేను.. ఈడీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి

రేపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) విచారణకు రాలేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. దర్యాప్తు సంస్థకు ఓ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఇవాళ ఓ లేఖ రాశారు ఆయన. ప్రస్తుతం సోనియాగాంధీ కొడుకు, కూతురు రాహుల్‌, ప్రియాంక వాద్రాలు గంగారాం ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో రాహుల్‌ గాంధీ ఈడీని కోరారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో.. రాహుల్‌ గాంధీ పాత్రపై అనుమానాలు ఏమిటో ఈడీ ఇప్పటిదాకా స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ, మూడు రోజుల పాటు మాత్రం ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా ప్రశ్నల వర్షం కురిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement