Saturday, May 18, 2024

క‌ల నిజ‌మైంది – రూ.2కోట్ల జాక్ పాట్ గెలుచుకున్న యువ‌కుడు

ఫాంట‌సీ క్రికెట్ యాప్ డ్రీమ్ 11యాప్..ఐపీఎల్ మ్యాచ్ లు చూసిన‌వారికి ఈ యాప్ గురించి తెలుస్తుంది. మ్యాచ్ లు చూస్తున్న‌ప్పుడు మధ్యలో డ్రీమ్ 11 యాప్ వాణిజ్య ప్రకటన రావడం, క్రికెటర్లు ఆ యాప్ గురించి ప్రచారం చేయడం తెలిసిందే. ఈ క్రికెట్ యాప్ ద్వారా జమ్మూకశ్మీర్ కు చెందిన ఓ యువకుడు కోటీశ్వరుడు అయ్యాడు. అతడి పేరు వసీమ్ రజా. జమ్మూకశ్మీర్ లోని బిజ్ బెహరా పట్టణ వాసి. వసీమ్ రజా గత రెండేళ్లుగా డ్రీమ్ 11 యాప్ లో అనేక క్రీడాంశాల్లో బెట్టింగ్ లతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇన్నాళ్లకు అతడిని అదృష్ట దేవత కరుణించింది. అతడు ఎంపిక చేసిన ఫాంటసీ క్రికెట్ జట్టు డ్రీమ్ 11 యాప్ లో ప్రథమస్థానంలో ఉండడంతో జాక్ పాట్ తగిలింది. వసీమ్ నిద్రపోతుండగా, ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు ఎంపిక చేసిన జట్టు డ్రీమ్ 11 యాప్ లో ప్రథమస్థానంలో ఉంది అని చెప్పాడు. దాంతో, వసీమ్ డ్రీమ్ 11 యాప్ చూడగా, రూ.2 కోట్ల జాక్ పాట్ గెలుచుకున్నట్టు అందులో మెసేజ్ ఉంది. జీవితంలో అంతమొత్తం ఎరుగని ఆ పేద కుటుంబానికి చెందిన యువకుడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆ డబ్బుతో తన తల్లికి చికిత్స చేయిస్తానని, ఆమె గత పదిహేనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోందని వెల్లడించాడు. ఇత మొత్తం వ‌స్తుంద‌ని తాను ఊహించ‌లేద‌ని తెలిపాడు ఆ యువ‌కుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement