Friday, May 10, 2024

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ .. సింధు, కిదాంబి శుభారంభం ..

బాలి : టాప్‌ ఇండియన్‌ షట్లర్‌లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు.. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మ్యాచుల్లో డెన్మార్క్‌కు చెందిన లైన్‌ క్రిస్టో ఫెర్సెన్‌పై విజయం సాధించింది. రెండు వరుస సెట్స్‌లో 21-14, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఇరువురు గ్రూప్‌-ఏ విభాగంలో తలపడ్డారు. మాజీ వరల్డ్ నెంబర్‌ వన్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌.. పురుషుల సింగిల్స్‌ విభాగంలో విజయ ఢంకా మోగించాడు. ఫ్రాన్స్‌కు చెందిన తోమ జూనియర్‌ పొపోవ్‌పై 21-14, 21-16 పాయింట్ల తేడాతో రెండు వరుస సెట్స్‌లో విజయం గెలుపొందాడు. 42 నిమిషాల్లో మ్యాచ్‌ పూర్తి చేశాడు. గ్రూప్‌-బీలో ఇరువురు తలపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement