Sunday, May 5, 2024

బీఆర్ఎస్ – కాంగ్రెస్ ఒక్క‌టే… బండి సంజ‌య్

బీఆర్ఎస్, కాంగ్రెస్​లు రెండూ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో ‘మహిళా గోస- బీజేపీ భరోసా’ దీక్ష పేరిట ఆ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. బెల్టు షాపులను వ్యతిరేకిస్తూ బీజేపీ మహిళా మోర్చా నేతల దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షను ప్రారంభించిన బండి సంజయ్ ప్రారంభించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై స్పందించకపోవడం..బీఆర్ఎస్, కాంగ్రెస్​లు ఒక్కటేనని రుజువు చేస్తున్నాయన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, మజ్లిస్ జెండాలు చూస్తే మహిళలు భయపడుతున్నారని అన్నారు. మహిళలపై అత్యాచారాలు నిరసిస్తూ దీక్ష చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement