Friday, May 3, 2024

Breaking | బ్రిటిష్ బిలియ‌నీర్, హిందుజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందుజా ఇక‌లేరు..

హిందుజా గ్రూప్ చైర్మన్, హిందుజా సోదరుల్లో ఒకరైన శ్రీచంద్ పరమానంద్ హిందుజా (ఎస్పీ హిందుజా) ఇవ్వాల (బుధ‌వారం) కన్నుమూశారు. 87 ఏళ్ల వయస్సులో ఆయన లండన్ లో చ‌నిపోయారు. నలుగురు హిందుజా సోదరుల్లో పెద్దవారైన‌ ఎస్పీ హిందుజా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

‘ఈరోజు మా కుటుంబ పితామహుడు, హిందుజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందుజా క‌న్నుమూసినందుకు గోపిచంద్, ప్రకాశ్, అశోక్, ఇతర హిందుజా కుటుంబం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది’ అని ఆయ‌న‌ కుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుటుంబ స‌భ్యులు. ఇక‌.. ఎస్పీ హిందుజా 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్ లోని కరాచీలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. ఈ ఏడాది జనవరిలో ఎస్పీ హిందుజా సతీమణి కూడా చ‌నిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement