Thursday, May 2, 2024

Breaking : రూ.కోటికి వెల్ఫేర్ గ్రూప్ కుచ్చుటోపీ – ఆందోళ‌న‌కి దిగిన డిపాజిట‌ర్లు

కృష్ణాజిల్లాలో వెల్ఫేర్ గ్రూప్ కుచ్చుటోపీ పెట్టింది. అగ్రిగోల్డ్ తర‌హాలో మోసం చేసేందుకు య‌త్నిస్తున్నార‌ని డిపాజిట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కోటి రూపాయ‌ల‌వ‌ర‌కు డిపాజిట్లు చేసిన బాధితులు. కాగా ఈ వెల్ఫేర్ గ్రూప్ కంపెనీకి ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ మౌలిక స‌దుపాయాల సంస్థ చైర్మ‌న్ మ‌ళ్ల విజయ్ ప్ర‌సాద్. విశాఖ ప‌ట్నం కేంద్రంగా వెల్ఫేర్ గ్రూప్ కార్య‌క‌లాపాలు కొన‌సాగించారు. కాల‌ప‌రిమితి ముగిసినా న‌గ‌దు చెల్లించ‌లేదు ఆ సంస్థ‌. దాంతో గుడివాడలో వెల్ఫేర్ గ్రూప్ కార్యాలయాన్ని మూసివేశారు. దాంతో ఆర్డీవో కార్యాల‌యం ఎదుట డిపాజిట‌ర్లు ఆందోళ‌న‌కి దిగారు. పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసినా కేసు న‌మోదు చేయ‌లేద‌ని డిపాజిట‌ర్లు వాపోయారు.త‌మ‌కి న్యాయం చేయాల‌ని వారు కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement