Friday, May 3, 2024

Breaking : రెండు విమానాల్లో – 490మంది విద్యార్థులను భార‌త్ కి త‌ర‌లింపు

ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభమ‌యింది. ప్ర‌త్యేక విమానంలో నేడు భార‌త్ కు రానున్నారు.అర్థ‌రాత్రి 1: 50కి ముంబై చేరుకోనుంది తొలి విమానం. కాగా రేపు ఉద‌యం 7 : 40కి ఢిల్లీ చేరుకోనుంది మ‌రో విమానం. రెండు విమానాల్లో భార‌త్ రానున్నారు 490మంది విద్యార్థులు. కాగా వీరిలో 22మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానం ముంబై నుంచి బయలుదేరింది. రష్యా సైనిక దాడి ఫలితంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం ముంబై నుంచి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు బయలుదేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement