Saturday, May 18, 2024

Breaking : మ‌మ‌తా బెన‌ర్జీకి షాక్ – ‘భీర్బూమ్’ ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ‌కు హైకోర్టు ఆదేశం

భీర్బూమ్ ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ‌కు కోల్ క‌తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని భీర్బూమ్ లో ప‌దిమంది సజీవ దహనం కేసు విచారణను CBIకి అప్పగిస్తూ క‌ల‌క‌త్తా హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. ఈ ఘటనపై కోల్‌కత్తా హైకోర్టు సుమోటోగా విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించవద్దని మమత బెనర్జీ సర్కార్ హైకోర్టును కోరింది. కాగా ఏప్రిల్ 7లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది. టీఎంసీనేత బ‌దుషేక్ హ‌త్య‌తో రాంపూర్ హ‌ట్ లో హింస‌ఘ‌ట‌న చోటు చేసుకుంది.. బ‌ధుషేక్ హ‌త్య‌తో ప్ర‌త్య‌ర్థుల ఇళ్ల‌కు నిప్పు పెట్టారు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు. బీర్భూమ్ ఘ‌ట‌న‌లో ప‌ది మంది స‌జావ‌ద‌హ‌న‌మ‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement