Sunday, April 28, 2024

Breaking : ‘కేజీహెచ్’ లో కిడ్నాపైన పాప ఆచూకీ క‌నిపెట్టిన పోలీసులు – నిందితుల అరెస్ట్

కేజీహెచ్ లో కిడ్నాపైన పాప‌ను క‌నిపెట్టారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ జంక్ష‌న్ వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. కారులో పాప‌ను త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. నిందితుల‌ను అరెస్ట్ చేశారు శ్రీకాకుళం పోలీసులు. కాగా ఆ పాప‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించ‌నున్నారు పోలీసులు. వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుండి 5 రోజుల పసికందు అపహరణకు గురిఅయింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రౌతుల పాలెం గ్రామానికి చెందిన అప్పాయమ్మ అనే మహిళ కాన్పు కోసం కేజీహెచ్ హాస్పిటల్ లో ఈ నెల 11 న చేరింది. అదే రోజు ఒక ఆడ శిశువుకు జన్మ ఇచ్చింది. బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పాపను పరీక్షల కోసం తీసుకెళ్తామని ఒక మహిళ పాప అమ్మమ్మ చేతినుండి తీసుకుని వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత పాప అపహరణకు గురి అయినట్లుగా అమ్మమ్మ గుర్తించింది. కేకలు వేయడంతో హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హాస్పిటల్ కు చేరిన ఏసీపీ శిరీష ఇతర పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా చీర కట్టుకున్న ఒక మహిళ, చుడీదార్ వేసుకున్న మరో మహిళ పాపతో ఒక ఆటోలో గురుద్వారా వరకూ వెళ్లినట్టు గమనించారు. ఆటో డ్రైవర్ ను ట్రేస్ చేసి ప్రశ్నించగా పెద్దగా వివరాలు తెలియద‌ని చెప్ప‌గా..నేడు ఆ నిందితుల‌ని పోలీసులు ప‌ట్టుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement