Thursday, April 25, 2024

ఈతకెళ్లి మరణించిన బాలుర కుటుంబాలకు మంత్రి మల్లారెడ్డి పరామర్శ

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువులోకి ఈత కోసం వెళ్లి మరణించిన ముగ్గురు బాలుర కుటుంబాలను రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బుధవారం ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఆ బాధిత కుటుంబాలను మంత్రి మల్లారెడ్డి పరామర్శించి, ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు కొండల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement