Wednesday, May 8, 2024

Breaking : మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు చుక్కెదురు – బెయిల్‌ తిరస్కరణ

ఢిల్లీ : సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేషనల్ స్టాక్ ఎక్చేంజీ(ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు చుక్కెదురైంది. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దాంతో ఎన్ ఎస్ ఈకి సంబంధించిన కేసులో ఆమెను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రెడీ అవుతోన్న‌ట్లు స‌మాచారం. కాగా ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించనున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్ ఎస్ ఈకి సంబంధించిన కీల‌క విష‌యాల‌ను ఆమె ఓ హిమాల‌య యోగితో పంచుకున్నార‌ని టాక్. కాగా ఎన్ ఎస్ ఈ గ్రూపు ఆప‌రేటింగ్ అధికారిగా, ఎండీగా స‌ల‌హాదారుగా ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్ ను నియ‌మించే స‌మ‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆమె పాల్ప‌డిన‌ట్టు సెబీ ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత చిత్రా రామ‌కృష్ణ ఇంట్లో ఐటీశాఖ సోదాలు నిర్వ‌హించింది. ఈ కేసులో ఆమెను సీబీఐ ప్ర‌శ్నించింది. సుబ్రమణ్యన్‌కు మార్చి 6 వరకు సీబీఐ కస్టడీ విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement