Saturday, May 18, 2024

Breaking : చిత్తూరు జిల్లాలో ప్రారంభ‌మైన ‘జ‌ల్లిక‌ట్టు’ వేడుక‌

చిత్తూరు జిల్లాలో జ‌ల్లిక‌ట్టు వేడుక ప్రారంభ‌మ‌యింది. క‌రోనా ఆంక్ష‌లు ఉన్నా జ‌ల్లి క‌ట్టులో యువ‌త పాల్గొన్నారు. కాగా ఈ జ‌ల్లిక‌ట్టులో ప‌లువురు యువ‌కుల‌కు గాయాలు అయ్యాయి. గాయాల‌పాలైనా యువ‌కులు మాత్రం లెక్క చేయ‌లేదు. జ‌ల్లిక‌ట్టులో పాల్గొన‌డాన్ని యూత్ హీరోయిజంగా భావిస్తుంటారు. చంద్ర‌గిరి మండ‌లం శానంబ‌ట్ల‌లో జ‌ల్లిక‌ట్టు సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. జ‌ల్లిక‌ట్టు వేడుక‌ను చూసేందుకు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి జ‌నం ఎగ‌బ‌డ్డారు. విజేత‌ల‌కు భారీ ఎత్తున బ‌హుమ‌తుల‌ను అంద‌జేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement