Thursday, April 25, 2024

Breaking:’థియేట‌ర్ల కంటే కిరాణాకొట్టు మేలు-టికెట్ ధ‌ర పెంచినా ప్రేక్షకులు కొనగలరు: నాని

ఏపీ ప్ర‌భుత్వం టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించి ప్రేక్ష‌కుల‌ను అవ‌మానించింద‌ని నేచుర‌ల్ స్టార్ హీరో నాని అన్నారు. టికెట్ ధ‌ర పెంచినా , కొనే సామ‌ర్థ్యం ప్రేక్ష‌కుల‌కి ఉంద‌న్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుంద‌ని నాని వాపోయారు. రేపు నాని న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో నాని ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా థియేట‌ర్ల కంటే కిరాణా కొట్టు మేల‌ని నానీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

థియేట‌ర్ లో కంటే కిరాణా షాపుల‌కే క‌లెక్ష‌న్ ఎక్కువ‌ని అన్నారు. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను ఉద్దేశించి నానీ కామెంట్స్ చేశారు. క్రిస్మ‌స్ నేప‌థ్యంలో శ్యామ్ సింగ‌రాయ్ ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి హీరోయిన్లుగా న‌టించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement