Saturday, May 4, 2024

Breaking : సినిమా నిత్యావ‌స‌రం – ఏపీ టికెట్ల వివాదంపై ‘బాల‌య్య’ రియాక్ష‌న్

ఏపీలో సినిమా థియేట‌ర్స్, టిక్కెట్ల‌పై ఇష్యూ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ఈ విష‌య‌మై స్పందించ‌గా రీసెంట్ గా ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఈ విష‌యంపై మాట్లాడారు. కాగా ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌టిగా ఉంటేనే టికెట్ల వివాదానికి తెర ప‌డుతుంద‌ని హీరో నంద‌మూరి బాల‌కృష్ణ అన్నారు. ఏపీ టికెట్ల వివాదంపై బాల‌య్య రియాక్ష‌న్ ఇచ్చారు. ఏ ఒక్క‌రి అభిప్రాయంతోనో తెగే స‌మ‌స్య క‌దాని చెప్పారు. టికెట్ల‌తో ప్ర‌భుత్వానికీ ఆదాయం వ‌స్తుంద‌న్నారు. సినిమా ఇప్పుడు నిత్యావ‌స‌రంగా మారింద‌న్నారు. ప్ర‌భుత్వం టికెట్ల విష‌యంపై ఆలోచించాల‌ని బాల‌కృష్ణ తెలిపారు. మ‌రి బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌ని ఎంత మంది స‌మ‌ర్థిస్తారు..ఏపీ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement