Friday, May 3, 2024

Breaking : బాలిక‌పై అత్యాచారం కేసులో ..ఐదుగురు ఆటోడ్రైవ‌ర్లు అరెస్ట్ ..


హైద‌రాబాద్ మైన‌ర్ రేప్ కేసులో నిందితుల‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదుగురు ఆటో డ్రైవ‌ర్ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాలిక‌పై ఆటో డ్రైవ‌ర్లు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నాలుగురోజులు బాలిక‌ని నిర్భందించి మెడిప‌ల్లిలో రేప్ చేశారు. కాచిగూడ కు చెందిన మైనర్ బాలిక కోఠి లోని ఓ కళాశాలలో చదువుతోంది. నాలుగు రోజుల క్రితం బాలిక తనకు తెలిసిన ఆటో డ్రైవర్ తో ఆటోలో కళాశాలకు వెళ్ళింది. కాగా ఆ బాలికకు …మాయ మాటలు చెప్పి మేడిపల్లి తీసుకువెళ్లాడు ఆటోడ్రైవ‌ర్.

రాత్రి అవుతున్న కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన త‌ల్లి దండ్రులు పోలీసులను పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు… మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు. కాగా బాలికను ఛాదర్ ఘాట్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ వదిలి వెళ్లాడు. తనపై ఆటో డ్రైవర్ లు చేసిన అఘాయత్యాని పోలీసుల‌కు తెలియ జేసింది. దీంతో అత్యాచారం చేసిన 5 గురు ఆటోడ్రైవర్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ ఐదుగురు ఆటో డ్రైవర్ లను రిమాండ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement