Monday, May 6, 2024

Breaking : 55వేల జ‌నాభా ఉన్న చోట ఎవ‌రైనా సారా కాస్తారా – సీఎం జ‌గ‌న్

అక్ర‌మ మ‌ద్యాన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ని తెచ్చామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. నాటు సారా కాసే వాళ్ల మీద 13వేల కేసులు న‌మోదు చేశామ‌న్నారు. అక్ర‌మ మ‌ద్యాన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థని తెచ్చామ‌న్నారు. టిడిపి అధినేత చంద్ర‌బాబు పొంత‌న‌లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. అసెంబ్లీలో టీడీపీ స‌భ్యులు హుందాగా ప్ర‌వ‌ర్తించాల‌ని తెలిపారు. సాధార‌ణ మ‌ర‌ణాల‌పై త‌ప్పుడు రాజ‌కీయం చేస్తున్నార‌న్నారు. 55వేల జ‌నాభా ఉన్న చోట ఎవ‌రైనా సారా కాస్తారా అని ప్ర‌శ్నించారు సీఎం. నిఘా ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంలో సారా త‌యారీ సాధ్య‌మా అన్నారు. మారు మూల గ్రామాల్లో నాటుసారా కాస్తారు అంటే న‌మ్మొచ్చ‌ని తెలిపారు. నాటుసారా కాసే వారిపై మా ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతుంద‌న్నారు. నాటుసారా కాసే వాళ్ల‌పై 13వేల కేసులు న‌మోదు చేశామ‌ని చెప్పారు. అక్ర‌మ మ‌ద్యాన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ని తెచ్చామ‌న్నారు. చంద్ర‌బాబు పొంత‌న‌లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement