Thursday, May 2, 2024

Breaking : మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ కోసం 58వేల మంది కార్మికులు – సాగ‌ర్ ప్రారంభం చారిత్ర‌క ఘ‌ట్టం – సీఎం కేసీఆర్

మ‌ల్ల‌న్న సాగ‌ర్ ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు కోసం 58వేల మంది కార్మికులు ప‌ని చేశార‌న్నారు. ఆ స‌మ‌యంలో ఓ దుర్మార్గుడు కోర్టే స్టే తెచ్చాడ‌ని మండిప‌డ్డారు. దాదాపు 610కి పైగా కేసులు వేశార‌ని చెప్పారు. ఇంజినీర్లు కూడా కేసుల‌కు బ‌య‌ప‌డ‌కుండా ప‌ని చేశార‌న్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ని జాతికి అంకితం చేశారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ను ప్రారంభించ‌డం చారిత్ర‌క ఘ‌ట్ట‌మ‌ని అన్నారు. ఈ మ‌హాయ‌జ్ఞంలో పాల్గొన్న ప్ర‌తిఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మ‌త్య్స , పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందుతోంద‌న్నారు. సోష‌ల్ మీడియాలో చిల్ల‌ర ప్ర‌చారాలు జ‌రుపుతున్నార‌న్నారు. మ‌న రాష్ట్ర అభివృద్ధిని చూసి మ‌హారాష్ట్ర సీఎం ఆశ్చ‌ర్య‌పోయార‌ని కేసీఆర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement