Thursday, April 25, 2024

Breaking : జ‌ల్లిక‌ట్టు పోటీలో 20మందికి గాయాలు.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

త‌మిళ‌నాడు పుదుకోట్టైలోని త‌చంకురిచిలో ఆదివారం జ‌ల్లిక‌ట్టు పోటీలు ప్రారంభ‌మ‌య్యాయి. కాగా మొద‌టిరోజే 20 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జల్లికట్టు పేరుతో మూగజీవాలను హింసిస్తున్నారనే ఆరోపణలతో గతంలో ఈ ఆటపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ ఆటలో పాల్గొన్న వారిలో కొంతమంది చనిపోతుండగా.. చాలా మంది గాయపడుతున్నారు.

దీంతో జల్లికట్టుపై నిషేధం విధించారు. అయితే, సుప్రీం కోర్టు వ‌ర‌కు వెళ్లి జల్లికట్టు పోటీల నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం షరతులతో జల్లికట్టు నిర్వహణకు అనుమతిచ్చింది. భారీ భద్రత మధ్య తమిళనాడు మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్, జిల్లా కలెక్టర్ కవిత ఈ పోటీలను ప్రారంభించారు. ఈ ఆటలో గెలుపొందిన క్రీడాకారులకు బైక్‌లతో పాటు విలువైన బహుమతులు అందజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement