Friday, March 29, 2024

ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement