Saturday, May 4, 2024

Breaking : అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిన మినీ బ‌స్సు-11మంది మృతి-మృతుల కుటుంబాల‌కి రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం

ఓ మినీ బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డింది.ఈ ప్ర‌మాదంలో 11మంది మ‌ర‌ణించారు.ఈ సంఘ‌ట‌న జ‌మ్మూక‌శ్మీర్ పూంచ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సు మండి నుంచి సాజియాన్ ప్రాంతానికి వస్తోంది. సాజియాన్ సమీపంలో ఓ లోతైన లోయలోకి బస్సు పడిపోవడంతో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. గాయపడిన వారిని మండిలోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement