Sunday, April 28, 2024

బోరుబావిలో ప‌డిన బాలుడు – ఐదు రోజులు శ్ర‌మించిన రెస్క్యూ టీం – అయినా ప్రాణాలు ద‌క్క‌లేదు

ఇంటి వ‌ద్ద ఆడుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తు 32మీట‌ర్ల లోతైన బోరు బావిలో ప‌డిపోయాడు ఐదేళ్ల బాలుడు. కాగా సాయంత్రం అయినా పిల్లాడు ఇంటికి రాక‌పోవ‌డంతో త‌ప్పిపోయాడేమోన‌ని అంతా వెతికారు ఇంటి స‌భ్యులు. కాగా స‌మీపంలోని బోరు బావి నుంచి కేక‌లు వినిపిస్తుండ‌టంతో అప్రమత్తమైన స్థానికులు.. వారి తల్లిదండ్రులను పిలిచారు. లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు..వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వి బాలుడు పడిన చోటుకు చేరుకున్నారు. అయినా పిల్లాడిని బతికించలేకపోయారు. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.ఈ సంఘ‌ట‌న మొరాకోలోని షెప్షావూలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ సంతాపం తెలిపారు. కాగా బాలుడి పేరు ర‌యాన్ అవ్రామ్ అని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement