Saturday, May 18, 2024

Kerala: RSS కార్యాలయంపై బాంబు దాడి

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) కార్యాలయంపై బాంబు దాడి జరిగిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కన్నూర్‌ జిల్లా పయ్యన్నూర్‌లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా భవనం కిటికిలు దెబ్బతిన్నాయి. అయితే, ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే, సీపీఐ (ఎం) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement