Saturday, April 20, 2024

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్ట్స్ లో స్థానం

గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు . బీసీసీఐ నిర్వహించిన ఓ టీ20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడం గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఐపీఎల్-2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. గత మే 29న ఈ మ్యాచ్ జరగ్గా, అక్షరాలా 1,01,566 మంది హాజరయ్యారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక హాజరు. ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం గుర్తించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధి నుంచి బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement