Monday, April 29, 2024

TS | తాతా దీవించు.. గ్రాడ్యుయేషన్​ పట్టా అందుకుని​ సీఎం కేసీఆర్​ కాళ్లకు మొక్కిన హిమాన్షు

మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. హిమాన్షు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యాభ్యాసం చేశాడు. 12వ తరగతి పూర్తి చేసిన హిమాన్షు ఇవ్వాల (మంగళవారం) ఓక్రిడ్స్ స్కూల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఆయన అర్ధాంగి శోభ, కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కుమార్తె అలేఖ్య కూడా హాజరయ్యారు.

ఇక.. గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న హిమాన్షు తన తాత సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. మనవడి వినయ విధేయతలకు మురిసిన కేసీఆర్ దీవెనలు అందించారు. కాగా, కేటీఆర్ అయితే పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు హిమాన్షుకు ఈ వేడుకలోనే ఎక్స్ లెన్స్ అవార్డును కూడా బహూకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement