Monday, April 29, 2024

Breaking: బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి ఈ రోజుల తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు.

వరంగల్ జిల్లాకు చెందిన జంగారెడ్డి.. ప్రస్తుతం హన్మకొండలో నివాసం వుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఈ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా జంగారెడ్డి విజయం సాధించారు. 1984 లోక్ సభ ఎన్నకల్లో దేశంలో బీజేపీ రెండు సీట్లు గెలవగా అందులో జంగారెడ్డి ఒకరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement