Sunday, May 5, 2024

Breaking: చెట్టును ఢీకొన్న బైక్​.. కానిస్టేబుల్​ మృతి

ములుగు జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. ఈ ఘటన వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవ్వాల జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట శివారులో వెంకటాపూర్ పోలీసు స్టేషన్లో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ నాగరాజు (32) బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement