Sunday, April 28, 2024

మ‌మ‌తాబెన‌ర్జీతో బీహార్ సీఎం చ‌ర్చ‌లు.. బిజెపిని ఓడించ‌డ‌మే ల‌క్ష్యం

వ‌చ్చే సార్వ‌త్రిక ఎల‌క్ష‌న్స్ ప్ర‌జ‌లు వ‌ర్సెస్ బిజెపిగా ఉంటాయ‌ని తెలిపారు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి మహా కూటమి ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి అహం లేదని చెప్పారు. ఈ రోజు కోల్ కతాకు వచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో మమత సమావేశం అయ్యారు. ఈ ఎన్నికల సమరానికి భావసారూప్యత గల ప్రతిపక్షాలన్నీ కలిసి రావడానికి తనకు అభ్యంతరం లేదని పునరుద్ఘాటించారు.తాను నితీష్ కుమార్‌కి ఒకే ఒక అభ్యర్థన చేశానన్నారు. జయప్రకాష్ నారాయణ ఉద్యమం బీహార్ నుంచే ప్రారంభమైంది. మనం బీహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, మనం తదుపరి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు.

అయితే ముందుగా మనమంతా ఐక్యంగా ఉన్నామనే సందేశం ఇవ్వాలి. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని నేను ముందే చెప్పాను. బీజేపీ జీరో అయిపోవాలని కోరుకుంటున్నాను. మీడియా మద్దతు, అబద్ధాలతో బీజేపీ పెద్ద హీరో అయ్యింది అని మమత పేర్కొన్నారు. తమ మధ్య చాలా సానుకూల చర్చ జరిగిందన్న నితీష్ కుమార్ రాబోయే ఎన్నికలకు ముందు అన్ని సన్నాహాలు చేయడం గురించి చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుత పాలకులు సొంత ప్రచారం తప్పితే దేశాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు కోల్‌కతా చేరుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర మహాకూటమి ఏర్పాటు విషయమై మమతను కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement