Friday, May 3, 2024

Bihar : సీఎం నితీష్‌ కుమార్ కి భ‌ద్ర‌తాలోపం.. దూసుకొచ్చిన బైక్

మార్నింగ్ వాక్ కి వెళ్లిన స‌మ‌యంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కి భారీగా భద్రతా లోపం చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయాన్ని చేధించుకుని నితీష్ కుమార్‌కు సమీపంలోకి వచ్చారు. నితీష్ కుమార్ తన నివాసం నుంచి సర్క్యులర్‌ రోడ్డులోని సర్క్యులర్‌ హౌసింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నితీష్ కుమార్ మార్నింగ్ వాక్ చేసే మార్గమైన సర్క్యులర్ రోడ్‌లోకి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బైక్‌పై వచ్చిన వ్యక్తులు నితీష్ వైపు రావడంతో ఆయన భద్రత కోసం వేగంగా రోడ్డుపై నుంచి ఫుట్‌పాత్‌పైకి దూకాల్సి వచ్చింది. బైక్‌పై వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం రబ్రీ దేవితో సహా పలువురు రాజకీయ నాయకులు నివసించే సర్క్యులర్ రోడ్ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు యువకులు తమ మోటార్‌సైకిల్‌ను వేగంగా నడుపుతూ తన సెక్యూరిటీ కవర్‌లోకి ప్రవేశించడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వయంగా ఫుట్‌పాత్‌పైకి దూకార‌ని పోలీసు అధికారి వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement