Sunday, May 19, 2024

బీహార్ సీఎంకు క‌రోనా పాజిటివ్

క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు దేశ్యాప్తంగా 14 వేల క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. అయితే తాజాగా.. బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. ఆయ‌న గ‌త నాలుగు రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆయ‌న అధికార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలేదు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు, రాష్ట్ర‌ప‌తిగా ముర్ము ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు కూడా నితీశ్ హాజ‌రుకాలేక‌పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement