Sunday, May 12, 2024

Hyderabad MMTS: ప్రయాణికులకు అలర్ట్.. ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్ లోని రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. MMTS రైల్వే సేవలను పొందుతున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. మూడు రోజుల పాటు నగరంలో పలు మార్గాల్లో తిరిగే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 18, 19, 20 తేదీల్లో రైళ్లను రద్దు చేయగా.. మొత్తం 36 రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఈనెల 18, 19, 20వ తేదీల్లో లింగంపల్లి-హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 8 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 8 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement