Monday, April 29, 2024

పవన్ ఫ్యాన్స్ కు షాక్.. భీమ్లా నాయక్ వాయిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటేస్ట్ మూవీ భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టిజర్స్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. భీమ్లా నాయక్ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గుర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement