Friday, May 3, 2024

రాహుల్ గాంధీ ఉద్యమానికి భట్టి మద్దతు.. గ్యాస్ ధరల పెంపుపై నిరసన

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలో చేపట్టిన నిరసనకు తెలంగాణ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మద్దుతు తెలిపారు. రాహుల్ కు మద్దతుగా గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో జిల్లా మహిళా కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ లకు దండలు వేసి మహిళా కాంగ్రెస్ నాయకులు ప్లేట్ల పైన శబ్దం చేస్తూ చావు డప్పు వాయించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశం అభవృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం..  ప్రజల నడ్డివిరిచే విధంగా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల నియంత్రణ చట్టాన్ని కార్పొరేట్ శక్తుల కోసం మోడీ ప్రభుత్వం రద్దు చేసి,  తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులు నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి విపరీతంగా ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement