Friday, May 3, 2024

Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీకి కరోనా.. ఆస్పత్రిలో చేరిన దాదా

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న దాదాను కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్ హాస్పిటల్‌లో చేర్చారని తెలుస్తోంది. ప్రస్తుతం దాదా ఆరోగ్యంగానే ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

గంగూలీకి స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.  ఈ విషయం తెలుసుకున్న అభిమానులు దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే గంగూలీ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారు. ఇటీవలే గంగూలీ సోదరుడు, తల్లి కొవిడ్​ బారినపడి కోలుకున్నారు.

కాగా, అనారోగ్యంతో గంగూలీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. తొలుత ఈ ఏడాది జనవరిలో ఛాతిలో నొప్పి రావడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రైట్ కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా గుండెలో రెండు స్టంట్లను అమర్చారు. అనంతరం ఆయన కోలుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement