Friday, May 10, 2024

ఉగ్ర‌వాదుల కాల్పుల్లో.. కశ్మీరీ పండిట్ మృతి

పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కాల్పులు జ‌రిపారు ఉగ్ర‌వాదులు. ఈ కాల్పుల్లో క‌శ్మీరీ పండిట్ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న పుల్వామా జిల్లాలో జరిగింది. పుల్వామాలోని అచ్చన్‌ ప్రాంతానికి చెందిన కశ్మీరీ పండిట్‌ సంజయ్ శర్మ ఆదివారం స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే సంజయ్‌ శర్మ మరణించినట్లు చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన మృతుడు సంజయ్‌ శర్మ స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో మైనార్టీలైన హిందువులున్న ఆ గ్రామంలో సాయుధ పోలీసులను మోహరించినట్లు చెప్పారు. అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్‌ సంజయ్‌ శర్మపై ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement