Thursday, May 16, 2024

టీడీపీకి పూర్వవైభవం‌ తీసుకొస్తాం : కాసాని జ్ఞానేశ్వర్

టీడీపీకి పూర్వవైభవం తీసుకురావటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ‘‘ఇంటింటికీ తెలుగుదేశం’’ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామగ్రామాన తెలుగుదేశం నినాదం మారుమోగేలా చేస్తామని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం‌ తీసుకురావటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ నేతలంతా నెలరోజుల పాటు గ్రామాలు, బస్తీల్లోనే ఉండాలన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టీడీపీని బలోపేతం చేస్తామని, టీడీపీలో చేరికకు పలువురు ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement