టాటా ఐపీఎల్ 2022లో 18వ మ్యాచ్లో భాగంగా ఇవ్వాల ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆట కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ నిర్ధేశిత ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఆరు వికెట్లు కోల్పోయింది. కాగా, 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు టీమ్ నిలకడగా ఆడుతోంది. 50 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు ఇక మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడింది. ఈ క్రమంలో 16 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 128 పరుగులతో బెంగళూరు జట్టు పటిష్టంగా ఉంది. రెండో వికెట్ భాగస్వామ్యంలో అనుజ్ రావత్ 66, విరాట్ కోహ్లీ 40 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.
ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్.. ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (16)ను పెవిలియన్ చేర్చాడు. 9వ ఓవర్లో బంతి అందుకున్న ఉనద్కత్ వేసిన బంతిని లాంగాన్లో సిక్సర్ కొట్టడానికి డుప్లెసిస్ ప్రయత్నించాడు. కానీ సరిగా టైమింగ్ సరిగా కుదరకపోవడంతో అది బౌండరీలైన్ వరకు వెళ్లలేదు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్కు సులభమైన క్యాచ్ వెళ్లింది. దాన్ని అతను అందుకోవడంతో డుప్లెసిస్ మైదానం వీడాడు. 50 పరుగుల స్కోరు వద్ద బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది.