Thursday, May 2, 2024

Tirumala: శ్రీవారి సేవలో బాలకృష్ణ

తిరుమల శ్రీవారిని హీరో నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బాలకృష్ణతోపాటు అఖండ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం శేషవస్త్రంతో బాలకృష్ణను సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. కరోనా పరిస్థితుల్లో అఖండ సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసిందన్నారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, బాలయ్య నటించిన అఖండ సనిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖండ టీం గత కొద్ది రోజులుగా వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నారు. నిన్న బాలయ్య విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement