Friday, April 26, 2024

మమతకు జై కొట్టిన మరో బీజేపీ నేత… టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో

పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిజెపి నుంచి అధిక సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయి.

అందుకే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఎంసీ గూటికి చేరగా…. తాజాగా కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. శనివారం కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నారు. 

ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ విస్తరణ లో బాబుల్ సుప్రియో మంత్రి పదవిని కోల్పోయారు. దాంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. పార్టీకి రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, రాజకీయాల నుంచి వైదొలగుతానని అప్పట్లో ప్రకటించిన బాబుల్ సుప్రియో… తాజాగా మనసు మార్చుకున్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తృణముల్ కాంగ్రెస్ లో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement