Wednesday, April 17, 2024

మందుబాబులకు షాక్.. మద్యం దుకాణాలు బంద్

మందుబాబులకు ఇది చేదు వార్తే. హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనం పురస్కరించుకుని మద్యం దుకాణాలు, పబ్బులు మూసివేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు దుకాణాలు బంద్ కానున్నాయి. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వైన్స్, బార్లు, పబ్బులు, కల్లు దుకాణాలు మూసివేయాలి పోలీసులు ఆదేశించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement