Friday, May 17, 2024

ర‌ష్యా , ఉక్రెయిన్ యుద్ధం గురించి – యూర‌ప్ ‘కాల‌జ్ఞాని’ ముందే చెప్పారా !

ఇండియాలో బ్ర‌హ్మంగారిలా యూర‌ప్ లో ఓ కాల‌జ్ఞాని ఉండేవార‌ట‌. ర‌ష్యా, ఉక్రెయిన్ వార్ గురించి ఆమె ముందే చెప్పార‌ట‌. బల్గేరియాకు చెందిన బాబా వంగా ఓ కాలజ్ఞానిగా యూరప్ దేశాల్లో గుర్తింపు పొందారు. ఆమె ఇప్పుడు లేరు. 1996లోనే పరమపదించారు. బాబా వంగాను బల్గేరియా దైవదూతగా అని పిలుస్తుంటారు. ఆమె అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. 1911లో బల్గేరియాలో జన్మించింది. అయితే, తన పన్నెండవ ఏట కంటిచూపు కోల్పోయింది. అయితే, తన ఎదుట నిలబడిన వారి వివరాలను, భవిష్యత్తును కచ్చితంగా చెప్పేదని, ఆమె చెప్పిన వాటిలో అత్యధిక శాతం నిజమయ్యాయని యూరప్ దేశాల ప్రజలు విశ్వసిస్తారు. అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికా ట్రేడ్ సెంటర్ పై దాడి చేస్తారని బాబా వంగా ముందే చెప్పారని, ఈయూ నుంచి పలు దేశాలు తప్పుకుంటాయని ఆమె చెప్పిన విషయాలు నిజమయ్యాయని యూరప్ దేశాల్లో ప్రచారంలో ఉంది. ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితిని బాబా వంగా ఆనాడే ఊహించారట. రష్యా దాడి నుంచి ఉక్రెయిన్ తప్పించుకోవడం అసాధ్యం అని, రష్యా ప్రపంచాధిపత్యం వహించడమే కాకుండా, వ్లాదిమిర్ పుతిన్ సర్వశక్తిమంతుడు అవుతాడని ఆ కాలజ్ఞాని చెప్పారు. యూరప్ ఖండం ఒక బంజరు భూమిలా మారిపోతుందని, రష్యా మాత్రం మహోజ్వలంగా వెలిగిపోతుందని ఆమె వెల్ల‌డించిన‌ట్టు ఇప్పుడు వార్త‌లు గుప్పుమంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement