Tuesday, May 7, 2024

బైక్ ను ఢీ కొట్టిన ఆటో ట్రాలీ.. ఇద్దరు మృతి

ఆటో ట్రాలీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన పెద్దపల్లి మండలం హనుమంతునిపేట శివారులో జ‌రిగింది. శుక్రవారం రాత్రి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన కోరే గణేష్, గౌతం ఆశ్విత్ పెద్దపల్లి నుండి పెగడపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాల్వ శ్రీరాంపూర్ నుండి పెద్దపల్లి వైపు వస్తున్న ఆటో ట్రాలీ బైక్ ను ఢీకొని చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పెగడపల్లి గ్రామానికి చెందిన గణేష్, ఆటో ట్రాలీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. అశ్విత్ కు తీవ్ర గాయాలు కావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పెద్దపెల్లి ఎస్సై రాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement